కరోనా వైరస్, లాక్ డౌన్ దెబ్బతో ఎవరికి వారు విలవిల్లాడుతున్నారు. కొన్ని కోట్ల మంది నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే కొన్ని చిత్ర విచిత్రాలు కూడా జరుగుతున్నాయి. తాజాగా కరోనా దెబ్బతో ఓ కొత్త పెళ్లి కొడుకు ఫస్ట్ నైట్ కు బ్రేక్ పడింది. కర్నాటక రాష్ట్రంలోని ఉడిపి జిల్లాలో కుత్యూరులో ఇటీవల ఓ పెళ్లి జరిగింది. అసలే లాక్డౌన్ నేపథ్యంలో పోలీసులు, పెళ్లిళ్లకు ఎంత మాత్రం అనుమతి ఇవ్వడం లేదు. ఇదిలా ఉంటే ఈ పెళ్లి జరిగాక ఫస్ట్ నైట్కు ముహూర్తం పెట్టారు. మరి కొద్ది సేపట్లో ఫస్ట్ నైట్ ప్రారంభ మవుతుందనగా పోలీసులు వచ్చి వరుడిని క్వారంటైన్కు తీసుకు పోయారు.
అయితే రెండు కుటుంబాల వారు ఫస్ట్ నైట్కు ముహూర్తం పెట్టుకున్నామని అధికారులకు సూచించారు. అయితే అధికారులు, పోలీసులు మాత్రం వేరే గ్రామం నుంచి వచ్చినందున పెళ్లి కొడుకును క్వారంటైన్కు తరలించాలని సూచించారు. దీంతో వరుడితో పాటు వరుడి బంధువులు 26 మందిని మొత్తం క్వారంటైన్కు తరిలించారు. దీంతో ఈ ఫస్ట్ నైట్కు బ్రేక్ పడింది.