సమాజంలో అప్పుడప్పుడు వింతలు.. విశేషాలు చోటుచేసుంటాయి.. కొన్నింటిని అయితే మనం అస్సలే నమ్మలేం కూడా..! తాజాగా.. ఇలాంటి నమ్మలేని చిత్రమైన ఘటనే చోటు చేసుకుంది జోగులాంబ గద్వాల జిల్లాలోని మానవపాడు మండలం పెద్దపోతులపాడు గ్రామంలో.. పెద్దపోతులపాటు గ్రామానికి చెందిన మంజులకు సమీప చిన్నపోతులపాడు గ్రామానికి చెందిన వెంకటేశ్తో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వారికి సంతానం కలుగలేదు. సమారు తొమ్మిది నెలల క్రితమే మంజుల గర్భందాల్చింది. ఈ విషయం తెలియగానే కుటుంబ సభ్యులంతా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. నెలలు నిండుతుండగా పురుడు కోసం మంజుల తల్లిగారింటికి వెళ్లింది. శనివారం రాత్రి ఆమెకు పురిటినొప్పులు రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. డాక్టర్ పరీక్షించేకంటే ముందే.. మంజులకు పూనకం వచ్చింది.
ఈక్రమంలో ఆమెకు పురిటినొప్పులు కూడా తగ్గిపోయాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను తిరిగి ఇంటికి తీసుకెళ్లారు. అయితే.. తెల్లవారేసరికి ఆమె గర్భం మాయమైంది. దీంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇదేమిటీ.. ఇలా ఎలా అయింది..? అంటూ నోరెళ్లబెట్టారు. అయితే.. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే.. ఆమె ప్రసవించినట్లు కూడా ఆధారాలు లేవు. గర్భస్రావం జరిగినట్లు కూడా లేదు. దీంతో అందరూ మంజులనే అనుమానిస్తున్నారు. ఆమె కావాలనే అలా నటించి ఉంటుందని అంటున్నారు. డాక్టర్ కూడా ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఆమె గత నెలవరకూ పరీక్షల కోసం తనవద్దకే వచ్చిందని, ఆ తర్వాత రాలేదని చెప్పడం గమనార్హం. ఆమె మానసిక పరిస్థితి కూడా సరిగా లేదని డాక్టర్ పేర్కొనడం గమనార్హం. అసలు ఏం జరిగిందో ఆ మంజులకే తెలియాలిమరి.