జమ్మూకశ్మీర్లోని హంద్వారాలో ఆదివారం ఉదయం హంద్వారా సమీపంలో దాదాపు 8 గంటల పాటు జరిగిన ఎన్కౌంటర్లో ఐదురుగు జవాన్లు వీర మరణం పొందిన విషయం తెలిసిందే. వీరిలో సీనియర్ కల్నల్ స్థాయి అధికారితో పాటు ఓ మేజర్ కూడా ఉన్నారు. అయితే ఉగ్రవాదుల కాల్పులను వెంటనే తిప్పి కొట్టిన భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు జరిపి ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారు. కాగా, వీరమరణం పొందిన జవాన్లకు ప్రధాని నరేంద్రమోడీ ట్విట్టర్లో నివాళులర్పించారు. *హంద్వారాలో అమరవీరులైన మన సాహసోపేత సైనికులకు భద్రతా సిబ్బందికి నివాళులు. వారి శౌర్యం, త్యాగం ఎప్పటికీ మరచిపోలేం. వారు అత్యంత అంకితభావంతో దేశానికి సేవ చేశారు, మన పౌరులను రక్షించడానికి అవిరామంగా పనిచేశారు. వారి కుటుంబాలకు, స్నేహితులకు సంతాపం* తెలుపుతూ ట్వీట్ చేశారు.
అలాగే.. రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్ కూడా నివాళులర్పించారు. తాజాగా.. అమరజవాన్లకు వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నివాళి అర్పించారు. ఈ మేరకు ట్విట్టర్లో ఎమోషనల్ పోస్ట్ చేశారు. * ఉగ్రవాదులతో జవాన్లు ఎంతో ధైర్యంగా పోరాడారు. మనందరినీ కాపాడడానికి వారు ప్రాణాలను త్యాగం చేశారు. ఇది భారత జవాన్ల ఉక్కు సంకల్పానికి నిదర్శనం. జైహింద్* అంటూ ట్వీట్ చేశారు.
I join the nation to salute our brave personnel who martyred while fighting and eliminating terrorists in Handwara. Their courage & sacrifice has exemplified the firm determination of our Security forces to protect the lives of all citizens. jai Hind.
— Vijayasai reddy v (@VSReddy_MP) May 4, 2020