IHG's Amala? | telugucinema.com

లాక్ డౌన్ కారణంగా మూగ జీవాలు ఆహారంలేక అలమటిస్తున్నాయి. కొందరు జంతు ప్రేమికులు మరియు స్వచ్చంద సంస్థలు ఇంకా ప్రభుత్వ ఏజెంట్స్ ఆహారం లేక అలమటిస్తున్న జంతువులకు ఆహారాన్ని ఇస్తూ తమ ఔదార్యాన్ని చాటుకుంటున్నారు. జంతువుల పట్ల అపారమైన ప్రేమను పెంచుకున్న జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ ఈ లాక్ డౌన్ లో ఆకలితో అలమటిస్తున్న జంతువులకు ఆహారాన్ని పెడుతూ వాటి ఆకలిని తీరుస్తోంది. అదేవిధంగా జంతువుల పట్ల అమానుష ప్రవర్త కలిగిన వారిమీద ఈ అమ్మడు తనదైన శైలిలో విమర్శలు చేస్తుంది. నిన్న ఢిల్లీలో మూగ జీవాలైన వీధికుక్కలపై జరిగిన అమానుష దాడిపై ఈ అమ్మడు ఘాటు  గానే   స్పందించింది. ఆ వీధి కుక్కలను అమానుషంగా కొట్టినవాడు అసలు మగాడే కాదని స్టేట్మెంట్ ఇచ్చింది.

IHG

ఇదిలా ఉండగా తన పక్కింటి వారి పై ఈ అమ్మడు ఘాటుగానే సమాధానం ఇచ్చింది ఎందుకంటె రష్మీ ఈ లాక్ డౌన్ లోనోరు లేని ముగా జీవాలకు ఆకలి తీర్చే పనిలో పడింది. ఈ సందర్భంగా తాను వీధి కుక్కలకు ఆహారం అందిస్తూ ఉండగా ఆమె పొరుగు వారు ఆ ఘటనను అడ్డుకున్నారట అయితే వారి పై రష్మీ ఇప్పుడు ఘాటుగానే స్పందిస్తూనే వుంది. తన ట్వీట్ లో ..క్రూరమైన మైండ్ సెట్ కలిగిన మా పొరిగింటి వాళ్ళు ముగా జీవాలకు ఆహారాన్ని పెట్టనివ్వట్లేదని వాపోయింది. అయితే వారిమీద క్రిమినల్ ఆక్షన్ తీసుకోబోతున్నట్లు ఈ అమ్మడు ప్రకటించింది. ఇందుకు సంబంధించి కొన్ని లా పాయింట్స్ కూడా పట్టుకొచ్చింది ...ముఖ్యంగా 51-A (జీ) ఆర్టికల్ ప్రకారం వారికీ కఠిన చర్యలు తీసుకోవలసింది గా తన ట్వీట్ లో పేర్కొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: