ఒకప్పుడు బుల్లితెరపై సెన్సేషన్ సృష్టంచిన సీరియళ్లు రామాయణం, మహాభారత్.  ఆదివారం వస్తుందంటే చాలు చిన్నా పెద్దా అంతా టివి ముందు కూర్చునేవారు.  అంత గొప్ప సీరియల్స్ ఇప్పుడు మళ్లీ ప్రేక్షకులను కనువిందు చేస్తున్నాయి.  ప్రస్తుతం దూరదర్శన్ లో మళ్లీ ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే.   అయితే రామాయణంలో రాముడికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో.. రావణాసురుడికి అంతే పేరు ఉంటుంది. అలనాటి ‘రామాయణ్‌’ సీరియల్‌లో రావణ పాత్రలో నటించిన అరవింద్‌ త్రివేది లంకేశ్‌(82) మరణించారని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 

 

దాంతో ఆయనకు ఎంతో మంది ఆయనకు శ్రద్దాంజలి ఘటిస్తున్నారు..  ఈ విషయం అరవింద్ కుటుంబానికి తెల్సింది. దీంతో వాళ్ళు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అరవింద్ మేనల్లుడు దీనిపై స్పందించారు.  అరవింద్‌ మరణించినట్టు జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని ఆయన మేనల్లుడు కౌస్తుభ్‌ ట్విట్టర్ లో తెలిపారు.  మా మేనమామ క్షేమంగానే ఉన్నారు.. ఇవన్నీ ఒట్టి రూమర్లు దయచేసి వాటిని నమ్మొద్దు అంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు.  ఆయన బతికే ఉన్నారన్న సమాచారాన్ని అందరికీ  తెలియజేస్తున్న’ అని కౌస్తుభ్‌ ట్వీట్‌ చేశారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: