తెలంగాణ‌లో చిక్కుకున్న వ‌ల‌స కార్మికుల‌ను స్వంత రాష్ట్రాల‌కు త‌ర‌లించే చ‌ర్య‌లు ముమ్మ‌రంగా కొన‌సాగుతున్నాయి.  లాక్‌డౌన్‌ నేపథ్యంలో తెలంగాణ నుంచి మూడు రోజుల క్రితం ప్ర‌త్యేక రైలు న‌డ‌ప‌గా.. తాజాగా వలస కార్మికులతో రెండో ప్రత్యేక రైలు బయలు దేరింది. 1250 మంది కార్మికులతో ఘ ట్‌కేసర్ నుంచి బీహార్‌లోని పట్నాకు మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల 20 నిమిషాలకు శ్రామిక్‌ ప్రత్యేక రైలు బయలుదేరినట్టు అధికారులు వెల్లడించారు. మేడ్చల్ కలెక్టర్‌తో పాటు రాచకొండ సీపీ, నోడల్ అధికారి ఏర్పాట్లను పర్యవేక్షించారు. 

 

మేడ్చల్ జిల్లా పరిధిలోని బిహార్ కార్మికులను గుర్తించి ప్రత్యేక రైలులో వారిని పంపించారు. గత రెండు రోజుల నుంచి వివిధ పోలీసు స్టేషన్లలో పేర్లు నమోదు చేసుకున్న వారిని పంపించినట్టు అధికారులు తెలిపారు. శుక్రవారం ఉదయం లింగంపల్లి నుంచి జార్ఖండ్‌లోని హతియాకు ప్రత్యేక రైలులో 1225 వలస కూలీలను తరలించిన సంగతి తెలిసిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: