తెలంగాణలో కరోనాను కట్టడి చేసేందుకు తెలంగాణ సర్కార్ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అక్కడ కరోనా కేసులు మాత్రం ఆగడం లేదు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లోని పలు ప్రాంతాలు రెడ్జోన పరిధిలో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా గ్రేటర్ హైదరాబాద్లో ఓ విషాదం చోటు చేసుకుంది.
జియాగూడ వెంకటేష్ నగర్లో నివసిస్తున్న వృద్ధురాలు(72) గత వారం కరోనా సోకి మృతి చెందగా, తాజాగా సోమవారం ఆమె కోడలు (55) కరోనా పాజిటివ్తో మృతి చెందింది. ఈ విషయాన్ని పోలీసులు ధృవీకరించారు. వీరిద్దరు కరోనా కాటుకు బలయ్యారు.
ఇక మిగిలిన కుటుంబ సభ్యులను సైతం కరోనా పరీక్షలకు పంపారు. ఇక నగరంలోనే బీఎన్రెడ్డినగర్ డివిజన్ ఎస్కేడీ నగర్లో సోమవారం ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే ఆయన భార్య, కుమారుడికి కరోనా పాజిటివ్ రావడంతో వారు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.