ఐఐటీ జేఈఈ, నీట్ పరీక్షా తేదీల‌ను ఎట్ట‌కేల‌కు ఖ‌రారు చేశారు. జూలై 18 నుంచి 23 వరకూ జేఈఈ మెయిన్ పరీక్షల‌ను నిర్వ‌హించ‌నున్నారు. అడ్వాన్స్‌ పరీక్షలు ఆగస్ట్‌లో జరుగుతాయి. జూలై 26న నీట్ పరీక్ష నిర్వహిస్తామని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ తెలిపారు. అంతేగాక సీబీఎస్‌ఈ పరీక్షలతో పాటు పది, పన్నెండో తరగతి బోర్డ్ ఎగ్జామ్స్‌పై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. 

 

కాగా కరోనా వైర‌స్ నియంత్ర‌ణ‌లో భాగంగా మార్చి 23 నుంచి దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ అమ‌లవుతోంది. అయితే అంత‌కంత‌కూ వైర‌స్ విస్త‌రిస్తుండ‌టం... కేసుల సంఖ్య కూడ పెరిగిపోతుండ‌టంతో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ మూడో ద‌శ లాక్‌డౌన్ ను మే 17 వ‌ర‌కు పొడిగించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే మే 3వ తేదీన జ‌ర‌గాల్సిన నీట్ ప‌రీక్ష‌ను వాయిదా వేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: