IHG

 

జబర్దస్త్ యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఎవరు మీద ఎటువంటి సెటైర్ వేస్తుందో తెలియదు.  తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో హాట్  బాంబుని   పేల్చింది. తన ట్విట్టర్ లో మన వరకు వస్తే గాని బుద్ధి రాదు అన్నమాట.... అంటూ ట్వీట్ చేసింది. దీంతో ఈ ట్వీట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా తయారయింది. అయితే నిన్న మంగళవారం విజయ్ దేవరకొండ తనపై వెబ్ సైట్లు ఎంత నీచంగా రాస్తున్నాయి వివరించి వారికి వార్నింగ్ ఇచ్చినట్లు ఓ వీడియోని తయారు చేశాడు.

IHG

 

అయితే ఈ వీడియో కి సంబంధించి టాలీవుడ్  ప్రముఖులు ఈయనకు మద్దతు తెలిపారు.  ప్రత్యేకంగా మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ఖాతా నుంచి ఆయనకు మద్దతుగా మాట్లాడారు... అలాగే హీరో మహేష్, రవితేజ, అల్లరి నరేష్ వంటి ప్రముఖులు ఆయనకు మద్దతు తెలిపారు. అయితే అనసూయ ఈరోజు పొద్దున చేసిన   ట్వీట్  విజయ్ దేవరకొండ కోసమే అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో అనసూయ ఇలాంటి సిచువేషన్  ఎదుర్కొన్నప్పుడు సినీ ఇండస్ట్రీ నుంచి గాని బుల్లితెర నుంచి గాని ఎవ్వరు కూడా  ఈమె కు మద్దతు తెలపలేదు. అయితే ఈ కారణంగానే ఈమె ఈ ట్వీట్ ని క్రియేట్ చేసి ఉంటుందని భావిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: