ఈ మద్య బాలీవుడ్, కోలీవుడ్, లాటీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ లో వరుసగా విక్షణ నటుడు ఇర్ఫాన్ పటాన్ అనారోగ్యంతో మృతి చెందిన మరుసటి రోజే బాలీవుడ్ దిగ్గజం.. అందాల నటుడు రిషీ కపూర్ ముంబాయి ఆసుపత్రిలోకన్నుమూశారు. ఈ విషాదాలు మరువక ముందే తాజాగా ప్రముఖ భోజ్పురి దర్శకుడు అనిల్ అజితాబ్ కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా బీహార్ లోని పాట్నాలో సోమవారం రాత్రి ఆయన చనిపోయినట్లు తెలిసింది. ‘హమ్ బాహుబలి’, ‘రణభూమి’, ‘ఏక్ దుజే కే లియే’ వంటి భోజ్పురి చిత్రాలకు అనిల్ దర్శకత్వం వహించారు.
గత కొంత కాలంగా ఆయన ఎన్నో బాలీవుడ్ చిత్రాలకు కూడా పనిచేశారు. ‘జై గంగాజల్’, ‘కిడ్నాపింగ్’, ‘దిల్ క్యా కరే’ వంటి చిత్రాల్లో అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశారు. ‘దాముల్’, ‘డెత్ పెనాల్టీ’, ‘కిడ్నాపింగ్’, ‘పాలిటిక్స్’, ‘బండిష్’ చిత్రాలకు స్క్రీన్ రైటర్గా సహకరించారు. ఇప్పటికే ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న సమయంలో మంచి దర్శకుడిని కోల్పోయామని భోజ్పురి సూపర్ స్టార్ దినేష్ లాల్ యాదవ్ ఇన్స్టాగ్రామ్ లో సంతాపం ప్రకటించారు.