మొన్నటి వరకు దేశంలో లాక్ డౌన్ ప్రకటించి ఇప్పుడు ఉన్నట్టుండి మద్యం అమ్మకాలు ప్రారంభించడం ఎంత వరకు న్యాయం అంటూ ఫైర్ అవుతున్నారు విశ్వనటుడు కమల్ హాసన్.  దేశంలో కరోనా ఇప్పటికీ తగ్గలేదు.. రోజు రోజుకీ కేసులు పెరిగిపోతున్నాయి.  ఈ నేపథ్యంలో కరోనా కట్టడి చేయడానికి లాక్ డౌన్ పాటించాలని.. భౌతిక దూరం పాటించాలని నీతి వ్యాఖ్యాలు చెబుతూ ఇప్పుడు మద్యం షాపులు ఓపెన్ చేస్తే అక్కడ ఎవరు భౌతిక దూరం పాటిస్తున్నారు..? కొట్టుకునే పరిస్థి కన్నులారా చూస్తున్నాం. లిక్కర్ షాపులు అమ్మకాలు చేపట్టవచ్చని కేంద్ర ప్రభుత్వం సూచనలు చేసింది. అయితే ఈ లాక్ డౌన్ సమయం లో మద్యం షాపులు తెరవాడని స్టార్ హీరో కమల హాసన్ తప్పుబట్టారు. అయితే ఈ సమయం లో ఈ పని చేయడం ప్రజలను మరింత ప్రమాదం లోకి నెట్టడమే అని ఆయన అన్నారు.  

 

తమిళనాడు లో అంతకంతకు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇటువంటి సమయం లో వైన్ షాపులు తెరవడం వల్ల ప్రజలు అక్కడ గుంపుగా చేరుతారు అని కమల్ తెలిపారు. లాక్ డౌన్ సమయం లో ప్రజల ఆరోగ్యం పై బాధ్యత లేకుండా ఇలా చేయడం కమల్ మడిపడ్డారు. దేశ వ్యాప్తంగా దాదాపు 40 రోజుల తరువాత వైన్స్ తెరవడంతో ప్రజలు అక్కడ గుమ్మిగూడుతున్నారు.  ఇదిలా ఉంటే   తెలంగాణలో కూడా వైన్స్ ఓపెన్ అవనున్నట్లు కేసీర్ తెలిపారు.  కమల్ హాసన్ మాత్రమే కాదు పలువురు మహిళా సంఘాలు కూడా లిక్కర్ షాప్ ఓపెనింగ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: