తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఈరోజు నుంచి మద్యం దుకాణాలను ఓపెన్ చేయడానికి అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. 40 రోజుల తర్వాత మద్యం దుకాణాలు ఓపెన్ కావడంతో పెద్ద ఎత్తున ప్రజలు క్యూ లైన్లలో బారులు తీరారు. అయితే కుటుంబాల్లో చిచ్చుపెట్టే మద్యం వల్ల హైదరాబాద్ నగరంలోని ఒక కుటుంబంలో వాగ్వాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న ప్రసాద్ అనే వ్యక్తి తాగిన మైకంలో శరీరంపై బ్లేడుతో కోసుకోవడం మొదలుపెట్టాడు. 
 
పూర్తి వివరాలలోకి వెళితే 40 రోజులుగా మూసిఉన్న మద్యం దుకాణాలు ఈరోజు తెరవడంతో బాలానగర్ కు చెందిన ప్రసాద్ అనే వ్యక్తి మద్యం తాగి భార్యతో గొడవకు దిగాడు. లాక్ డౌన్ అమలవుతున్న సమయంలో మద్యం ఎందుకు కొన్నావని భార్య ప్రశ్నించగా తాగిన మత్తులో బ్లేడుతో శరీరంపై కోసుకోవడం ప్రారంభించాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: