విశాఖ‌లో స్టెరీన్ గ్యాస్ లీక్ అవ్వ‌డంతో మ‌హాన‌గ‌రం ఉద‌యాన్నే విల‌విల్లాడిపోయింది. ఏకంగా ఐదారు గ్రామాల ప్ర‌జ‌లు ఈ విష వాయువు పీల్చి విల‌విల్లాడిపోయారు. న‌గ‌రంలోని గోపాలపట్నం సమీపంలో ఆర్ ఆర్ వెంకటాపురం సమీపంలో ఎల్జీ పాలిమర్స్‌లో విష వాయువు లీకేజీ ఘటన కలకలంరేపింది. వేకువజామున ఒక్కసారిగా గ్యాస్ లీక్ కావడంతో స్థానికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.. ఘటనలో మరణాల సంఖ్య పెరుగుతోంది. వందలాదిమంది ఆస్పత్రి పాలయ్యారు.

 

ఈ స్టెరీన్ గ్యాస్ దెబ్బ‌తో ప‌శువులు, పిట్ట‌లు ఎక్క‌డిక‌క్క‌డ కొట్టుకుంటూ చనిపోయాయి. ప‌శువుల కొట్టాల్లో క‌ట్టేసిన ప‌శువులు అలాగే చ‌నిపోయాయి. ఇక కుక్క‌లు సైతం ఈ విష‌వాయువు పిల్చి చ‌నిపోయాయి. చివ‌ర‌కు ఎలుక‌ల్లో ఉన్న క‌లుగులు సైతం ఉక్కిరి బిక్కిరి అయ్యి ఈ గాలి పీల్చి బ‌య‌ట‌కు వ‌చ్చి గిల‌గిలా కొట్టుకుంటూ చ‌నిపోయాయి. దీనిని బ‌ట్టి ఈ ప్ర‌మాద తీవ్ర ఎంత ఉందో తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: