బీజేపీ నేత డీకే అరుణ త‌న‌దైన శైలిలో ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. మొన్న మంత్రివ‌ర్గ స‌మావేశంలో అనంత‌రం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో సీఎం కేసీఆర్ ప్ర‌తిప‌క్షాల‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డిన విష‌యం తెలిసిందే. కేసీఆర్ వ్యాఖ్య‌ల‌పై డీకే అరుణ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు.ఈ మేర‌కు బుధ‌వారం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ప్ర‌జారోగ్యం క‌న్నా రాష్ట్ర ఖ‌జానానే ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు ముఖ్య‌మై పోయింద‌ని,  తాగండి, చావండి, ఖజాన‌ను మాత్రం నింపండి అన్న‌ట్టుగా కేసీఆర్ వ్య‌వ‌హిస్తున్నార‌ని మండిప‌డ్డారు. కేసీఆర్‌కు చేత‌గాక కేంద్ర ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని ఆమె ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

 

అయితే.. తాజాగా.. గురువారం డీకే అరుణ ట్వీట్ చేశారు. ఇందులో పేప‌ర్లో వ‌చ్చిన ఆ ప్ర‌క‌న‌ను పొందుప‌ర్చి కామెంట్స్‌ను జోడించారు. * ప్రజా సమస్యల పైన మాట్లాడితే " బోకేర్ గాల్లు, తలకు మాసిన సన్నాసులు, పనికి మాలిన వాళ్ళు" అని మాట్లాడి నువ్వు నీ నిజస్వరపాన్ని చుపించుకున్నవ్. సొల్లు పురాణం చెప్పుడు కాదు, నీ యొక్క మరియు నీ పుత్రరత్నం నియోజకవర్గం లో జరుగుతున్న వాటి పైన స్పందించి సమస్యల పరిష్కారం చేయండి సీఎం గారు* అంటూ డీకే అరుణ సెటైర్లు వేశారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: