క్రికెట్ నుంచి తప్పుకున్న తర్వాత టీం ఇండియా మాజీ ఓపెనర్, బిజెపి ఎంపీ గౌతం గంభీర్ సేవా కార్యక్రమాల విషయంలో తన వంతుగా ఏదోక సహాయం చేస్తూనే ఉన్నారు. ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన సైనికులకు పోలీసులకు తన వంతుగా సహాయం చేస్తున్నాడు. 

 

తాజాగా అమిత్ అనే ఒక పోలీసు అధికారికి అతను అండగా నిలిచాడు. ఇటీవల అమిత్ కరోనా వైరస్ పై పోరాటంలో మరణించారు. వ్యవస్థ ఫెయిల్ అయిందని, అమిత్ ని మనం వెనక్కు తీసుకుని రాలేమని, దీనితో అతని పిల్లలను తాను చూసుకుంటా అని పూర్తి విద్యను తాను అందిస్తా అని, గౌతం గంభీర్ ఫౌండేషన్ అండగా ఉంటుంది అని చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: