ఉత్తర్ ప్రదేశ్ మాజీ సీఎం మరియు సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ అస్వస్థతకు గురిఅయ్యారు. గత కొద్దీ రోజులుగా ఆయన ఉదర కోశ సంభందిత వ్యాధితో బాధపడుతున్నారు. తాజాగా ఈయన పరిస్థితి కాస్త విషమించడంతో లక్నో లోని ఓ ప్రయివేట్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. అయితే ఉన్నటుంది కడుపు నొప్పి రావడంతో హాస్పిటల్ కి తరలించినట్లు కుటుంబసభ్యులు తెలియజేస్తున్నారు.

IHG

 

ప్రస్తుతం ఈయన వయసు 80 సంవత్సరాలు. హాస్పిటల్ వైద్యులు ఆయనకు అన్నిరకాల టెస్ట్ లు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం అయన ఆరోగ్యం నెమ్మదిగా కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. కాగా త్వరలోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని పేర్కొన్నారు. అటు ములాయం సోదరుడు శివపాల్ సింగ్, కోడలు డింపుల్ యాదవ్‌లు ఆస్పత్రిలో ములాయంను పరామర్శించారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: