ఇప్పుడు కరోనా విషయంలో కేంద్ర ప్రభుత్వం చైనా మీద తీవ్ర ఆగ్రహంగా ఉన్న సంగతి తెలిసిందే. చైనా కరోనా వైరస్  కట్టడిలో మనకు సహకరించడం లేదని ఆగ్రహంగా ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు చైనా మీద కీలక నిర్ణయం తీసుకోవడానికి సిద్దమయ్యారు.

 

త్వరలో మోడీ కేబినేట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ కేబినేట్ సమావేశంలో ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. చైనా నుంచి పూర్తిగా కొన్ని పరికరాలను ఆపేయాలని ఆయన భావిస్తున్నారు. కేబినేట్ తో పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత ఈ నిర్ణయాన్ని అమలు చేసే అవకాశం ఉంది అని అంటున్నారు. లాక్ డౌన్ పై కూడా త్వరలో జరిగే కేబినేట్ సమావేశం లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: