విశాఖలో జరిగిన ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ ప్రమాదం ఇప్పుడు నిజంగా ఎన్నో విషాదాలను నింపింది. ఒకరకంగా చెప్పాలి అంటే మరణాలు చాలా తక్కువగా నమోదు అయ్యాయి. అంత ప్రమాదం జరిగినా రాష్ట్ర ప్రభుత్వం మరణాలు ఎక్కువగా లేకుండా జాగ్రత్త పడింది. అయితే మరణించిన వారు, మరణించిన తీరే ఆవేదన కలిగిస్తుంది. 

 

గ్రీష్మ అనే చిన్నారి గ్యాస్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. తల్లి తండ్రులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మార్చురీ నుంచి 5 మృత దేహాలను అధికారులు స్వస్థలాలకు పంపించారు. దీనితో గ్రీష్మ మృతదేహం చూసిన పిన్ని బాబాయ్ గుండెలు అవిసేలా రోదించారు. తల్లి తండ్రులకు చిన్నారి కడ చూపు దక్కలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: