హైదరాబాద్ నగరంలో భారీగా లాక్ డౌన్ ఉల్లంఘన జరుగుతుంది లాక్ డౌన్ అమలులో ఉన్నా సరే వేలాది మంది రోడ్ల మీదకు వచ్చేస్తున్నారు. కార్లు, బైకులు భారీగా రోడ్ల మీదకు వస్తున్నాయి. వేలాది మంది ఒక్కసారిగా బయటకు రావడంతో పోలీసులు సిగ్నల్ వ్యవస్థను మొదలుపెట్టారు. 

 

46 రోజుల తర్వాత హైదరాబాద్ లో ట్రాఫిక్ లైట్స్ వెలిగాయి. అవసరం ఉన్నా లేకపోయినా సరే నిత్యావసర సరుకుల పేర్లు చెప్పి మెడికల్ అంటూ బయటకు వస్తున్నారు. చిన్న చిన్న అవసరాల కోసం కరోనా ఉన్నా సరే ఆగడం లేదు జనాలు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. లాక్ డౌన్ విషయంలో కఠినం గా ఉండాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: