ఆంధ్రప్రదేశ్ కరోనా హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది. కాసేపటి క్రితం వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ లో రాష్ట్ర౦లో గత 24 గంటల్లో కొత్త కరోనా కేసులు 43 నమోదు అయినట్టు పేర్కొన్నారు. ఏపీలో కరోనా కేసులు 1930 కి చేరుకున్నాయి. ఏపీలో యాక్టివ్ కేసులు 999 ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది. 

 

24 గంటల్లో ముగ్గురు కరోనా కారణంగా మరణించారు. ఇప్పటి వరకు మొత్తం 44 మంది కరోనా కారణంగా మరణించగా 887 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. కర్నూలు లో ఆరు కేసులు, గుంటూరు లో 2 కేసులు నమోదు అయ్యాయి. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 16 కేసులు ఆ తర్వాత చిత్తూరు లో 11 కేసులు నమోదు అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: