చిన్న పిల్లల కబడ్డీ ఆట పెద్దల మధ్య గొడవకు కారణం అయ్యింది. మొరాదాబాద్ లో కొంత మంది పిల్లలు కబడ్డీ ఆట ఆడుతున్నారు .ఉన్నట్టుండి వీరి మధ్య గొడవ వచ్చింది.ఈ విషయాన్నీ పిల్లలు తమ పెద్దలకు చెప్పడంతో వారి తల్లితండ్రులు మరియు పెద్దల మధ్య పిల్లల విషయమై గొడవ మొదలైంది. అయితే ఆ గొడవ కాస్త పెద్దదిగా మారి కొట్లాటకు దారి తీసింది. ఈ తతంగం అంతకుడా ఆ పక్కనే ఉన్న సీసీ టీవీ లో రికార్డ్ అయ్యింది.
మజ్ హోలా పోలీస్ స్టేషన్ పరిధిలోని కాశీరాం కాలనీలో ఈ గొడవ జరిగింది. ఈ విషయాలను సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా తెలుసుకొని పలు సెక్షన్ల క్రింద కేసు నమవుదు చేశామని అదనపు ఎస్పీ దీపక్ భూకేర్ తెలిపారు.