ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు కుప్పలు తెప్పలు గా వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా లో పదే పదే వార్తలను ప్రసారం చేస్తున్నారు. దీనిపై ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆగ్రహంగా ఉన్నాయి. 

 

నిందితులపై చర్యలు తీసుకోవడానికి గానూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్దం అయ్యాయి. తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు క్యాన్సర్ అని ప్రచారం చేసారు. దీనిపై గుజరాత్ పోలీసులు స్పందించారు. నలుగురు యువకులను అహ్మదాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. వారి మీద కేసులు నమోదు చేసి రిమాండ్ కి తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: