విశాఖ లో జరిగిన గ్యాస్ లీక్ దుర్ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఇది మిగిల్చిన నష్టం పెద్దగా పైకి కనపడటం లేదు గాని దాని తీవ్రత చాలా అధికంగా ఉంది అంటున్నారు నిపుణులు. ఆ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో భారీగా పశువులు చనిపోవడమే కాకుండా తెలుపు రంగు ఇళ్ళు కూడా రంగులు మారాయి. 

 

ఇక పంట చేలు అయితే మాడిపోయి కనపడుతున్నాయి. అరటి గెలలు నల్లగా మాడిపోయి కనపడిన ఫోటోలు జాతీయ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఒక యాక్టీవా బండి రంగు కూడా పూర్తిగా నాశనం అయిపోయింది. దాని మీద ఉన్న ఎరుపు రంగా పూర్తిగా పగిలిపోయినట్టు అయింది. ఈ ఫోటో కూడా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: