ప్రస్తుతం ఎండాకాలం సీజన్ కావడంతో కొన్ని సార్లు మంటలు ఉన్నట్టుండి పుట్టుకు రావడం చూస్తుంటా. మహబూబ్ నగర్ జిల్లాలో తాజాగా ఒక వింతైన ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని బయ్యారం మండలం కోటగడ్డ గ్రామంలో స్థానికంగా నివాసముంటున్న వేములపల్లి రాజు అనే వ్యక్తి ఇంట్లో ఉన్నట్టుండి తన ఇంట్లోని వస్తువలన్నీ కూడా అకస్మాత్తుగా కాలిపోతున్నాయి. ప్రస్తుతం ఎండాకాలం సీజన్ కనుక ఇలా ఉన్నఫలంగా మంటలు వస్తున్నాయని భావించారు. అలాంటే అక్కడక్కడ మంటలు రావడంతో బహుషా ఏదైనా షార్ట్ సర్కిట్ వల్ల ఇలా జిరిగిందేమో అని భావించారు. కానీ ఇంత వరకు కూడా వాళ్ళ ఇంట్లో ఎలాంటి షార్ట్ సర్క్యూట్ కానీ, మరే ఇతర ప్రమాదాలు కూడా జరగలేదని వారు వెల్లడించారు.
అంతేకాకుండా ఈ ఉహించనటువంటి పరిణామం కారణంగా తన ఇంట్లోని వస్తువులన్నీ కూడా కాలి బూడిద అవుతున్నాయి. వేములపల్లి రాజు తన ఇంట్లో జరుగుతున్న ఇలాంటి వింత పరిణామాం గురించి భయంతో వణికిపోయాడు. గత మూడు రోజులుగా వరుసగా ఇలాంటి ప్రమాదాలు జరగడంతో రాజు కుటుంబ సభ్యులతో పాటు, ఆ ఊరి జనం అందరు కూడా తీవ్రమైన భయాందోళనకు గురవుతున్నారు.
ఇక తమ ఇంట్లోకి అడుగు పెడితే మరింత ప్రమాదం వాటిల్లుతుందని భయంతో ఆరు బయటే ఉంటున్నారు రాజు కుటుంబీకులు. అయితే స్థానికుల సహాయంతో సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఈ వరుస ప్రమాదాలకు గల కారణాలను వెతికే పనిలో ఉన్నారు.