భారతదేశ చరిత్రలో చిర స్థాయిలో నిలిచిపోయిన కవి రవీంద్ర నాథ్ ఠాగూర్. ప్రపంచ దేశాల్లో ఆయన కీర్తి ప్రతిష్టలు సంపాదించారు. తాజాగా ఆయన జయంతి సందర్భంగా ఇజ్రాయిల్ ఆయనకు అరుదైన గౌరవాన్ని ఇచ్చింది. రవీంద్రనాథ్ ఠాగూర్ 159 వ జయంతి సందర్భంగా, ఇజ్రాయెల్ టెల్ అవీవ్‌లో ఒక వీధికి టాగూర్ అనే పేరు పెట్టారు. 

 

భారత్ లోని ఇజ్రాయెల్ ఎంబసీ ఈ విషయాన్ని పంచుకుంది. తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. "ఈ రోజు మరియు ప్రతిరోజూ  రవీంద్రనాథ్ ఠాగూర్‌ను గౌరవిస్తా౦, మానవజాతికి ఆయన చేసిన విలువైన సహకారానికి గానూ ఆయన జ్ఞాపకార్థం టెల్ అవీవ్‌లో ఒక వీధికి ఆయన పేరు  పెట్టా౦ అని పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: