విశాఖ ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీక్ ప్రమాదం రాజకీయ దుమారం రేపుతుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు పరోక్షంగా అధికార పార్టీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి కారణం వైసీపీ అనే పరోక్ష విమర్శలు కూడా వస్తున్నాయి. దీనికి వైసీపీ కూడా అదే స్థాయిలో స్పందిస్తుంది.
తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఈ ప్రమాదంపై చంద్రబాబు కమిటీ వేయడాన్ని తీవ్రంగా తప్పు బడుతూ తన స్టైల్ లో ట్వీట్ చేసారు. “ఐఏఎస్ల కమిటీలో నిపుణులు లేరన్న బాబు... ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త అచ్చెన్నాయుడు నేతృత్వంలో కమిటీ వేయటం అంటే... క్యా బాత్ హై!” అని పేర్కొన్నారు.
ఐఏఎస్ల కమిటీలో నిపుణులు లేరన్న బాబు... ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త అచ్చెన్నాయుడు నేతృత్వంలో కమిటీ వేయటం అంటే... క్యా బాత్ హై!
— Vijayasai reddy v (@VSReddy_MP) May 9, 2020