ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఉన్నది లేనట్టు.. లేనిాది ఉన్నట్లుగా వార్తలు రావడం.. దానికి బాధితులు వివరణ ఇవ్వడం కామన్ అయ్యింది. ఈ తిప్పలు సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అనుభవిస్తున్నారు. తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోగ్యం బాగాలేదంటూ పుకార్లు వినిపిస్తున్నాయని, వాటిని తాము ఖండిస్తున్నామని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఇప్పటికే ప్రకటన చేశారు. అయితే విషయం పై వెంనే అమిత్ షా స్పందించారు.. తన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లను కొట్టిపారేశారు. తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని, తాను ఎలాంటి జబ్బుతో బాధపడడంలేదని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రిగా తన విధులను సంపూర్ణ అంకితభావంతో నిర్వర్తిస్తున్నానని తెలిపారు.
కరోనా వైరస్ తో తల్లడిల్లుతున్న వేళ తాను విధి నిర్వహణలో తలమునకలుగా ఉన్నానని, ఇలాంటి రూమర్లను పట్టించుకోవడంలేదని స్పష్టం చేశారు. ఇలాంటి వికృత చేష్టలున్న వ్యక్తుల మాటలు పట్టించుకోవొద్దని అమిత్ షా పేర్కొన్నారు. తాజాగా దీనిపై స్పందించిన జనసేన అధ్యక్షులు, నటులు పవన్ కళ్యాన్ ఇలాంటి పుకార్లు అమిత్ షాపై రావడం బాధాకరమని పేర్కొన్నారు. అమిత్ షాపై ప్రచారంలో ఉన్న పుకార్లలో నిజంలేదని తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
It is sad,such baseless rumours are being spread on Hon.Home minister Sri @AmitShah ji. https://t.co/CB2dE6zYSI
— pawan Kalyan (@PawanKalyan) May 9, 2020