సొంత ఊర్లకు వెళ్ళడానికి ఇప్పుడు వలస కూలీలు పడుతున్న కష్టం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. వరుస ప్రమాదాలకు గురవుతున్నారు వలస కూలీలు. ఇటీవల మహారాష్ట్ర లోని ఔరంగాబాద్ లో ఒక ఘోర రైలు ప్రమాదంలో 14 మంది వలస కూలీలు దారుణంగా ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన మరువక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. 

 

మధ్యప్రదేశ్ లోని పటా లో ఒక ట్రక్ బోల్తా పడింది. ఈ ట్రక్ ప్రమాదంలో 5 మంది వలస కూలీలు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా మరో 11 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి అని అధికారులు చెప్పారు. హైదరాబాద్ నుంచి ఉత్తరప్రదేశ్ వెళ్తున్నట్టు అధికారులు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: