దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు అత్యంత వేగంగా విస్తరిస్తున్నాయి. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది. ఈ హెల్త్ బులిటెన్ లో కరోనా వైరస్ కేసులు దేశ వ్యాప్తంగా 62 వేలు దాటాయి. మరణాలు కూడా రెండు వేలు దాటాయి. 128 మంది కరోనా కారణంగా 24 గంటల్లో ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల్లో 3227 మందికి కరోనా సోకింది. 

 

మహారాష్ట్రలో కరోనా కేసులు 20 వేలు దాటాయి. దేశ వ్యాప్తంగా 1200 మందికి పైగా డిశ్చార్జ్ అయ్యారు. మరణాలు కూడా వేగంగా పెరగడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. లాక్ డౌన్ అమలులో ఉన్నా సరే ఈ స్థాయిలో కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. అయితే కేసులతో పాటుగా డిశ్చార్జ్ అయ్యే వారి సంఖ్య కూడా పెరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: