కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే జువ్వాడి రత్నాకర రావు తుది శ్వాస విడిచారు. బుగ్గారం నుంచి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యే గా కాంగ్రెస్ తరుపున ఎన్నికైన రత్నాకర్ రావు స్వగ్రామం... ధర్మపురి మండలంలోని తిమ్మాపూర్. కాంగ్రెస్ తరుపున 1999, 2004 లో వరుసగా బుగ్గారం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 

 

నాటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ కేబినేట్ లో 2007 లో ఆయన దేవాదాయ శాఖా మంత్రిగా బాధ్యతలు నిర్వహించగా... 2009 ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. వైఎస్ కి అత్యంత సన్నిహిత మంత్రిగా కూడా ఆయనకు పేరు ఉంది. 1989 లో బుగ్గారం నుంచి జువ్వాడి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి ఎమ్మెల్యే గా విజయం సాధించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: