తెలంగాణాలో కరోనా వైరస్ కట్టడి అయినట్టే అయి మళ్ళీ పెరుగుతుంది. ఇన్నాళ్ళు పది లోపే నమోదు అయిన కరోనా కేసులు ఇప్పుడు మళ్ళీ వేగం పుంజుకున్నాయి. ఒక్కసారిగా 31 కేసులు ఒక్క రోజే నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వలస కూలీలకు భారీగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. 

 

తాజాగా మంచిర్యాల జిల్లాలో ముగ్గురు వలస కూలీలకు కరోనా సోకింది. హాజీపూర్ లో ఈ కేసులు బయటపడ్డాయి. ఈ నెల 5 న ముంబై నుంచి హాజీపూర్ లోని రాంపల్లి కి వచ్చారు వలస కూలీలు. ఇప్పుడు వారిని బెల్లంపల్లి ఐసోలేషన్ సెంటర్ నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: