టాలీవుడ్ బాహుబలి ప్రభాస్ మథర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం హీరో ప్రభాస్ జాను చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. బాహుబలి చిత్రంతో ప్రభాస్ ప్రపంచ స్థాయిని అందుకున్నాడు. ఆతరువాత వచ్చిన సాహూ కలెక్షన్స్ పరంగా కాస్త బెటర్ అనిపించినా కొద్దిరోజులకే కనుమరుగైంది. ప్రస్తుతం తీస్తున్న జాను తో ప్రభాస్ బాక్సాఫీస్ పని పెడతాడేమో చూడాలి. ఈ చిత్రం లో పూజ హెగ్దే ప్రభాస్ తో జత కట్టిన విషయం మన అందరికి తెలిసిందే.
ఇక ఈ చిత్రం ద్వారా వీరిద్దరి జంట సిల్వర్ స్క్రీన్ పై ఎలా ఉంటుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదుచూస్తున్నారు.లాక్ డౌన్ తరువాత సినిమాని రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. నేడు మథర్స్ డే సందర్భంగా పలువురు సినీతారలు తమ అమ్మప్రేను గుర్తు చేసుకున్నారు. మథర్స్ డే సందర్భంగా విషెస్ తెలిపారు. టాలీవుడ్ హీరో ప్రభాస్ ఈ సందర్భంగా మథర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే ఈ సందర్భంగా తన తల్లి శివ కుమారి గారి ఫొటోస్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు...
Our darling #Prabhas with his mother 'Siva Kumari' garu!!!
— prabhas (@PrabhasRaju) May 10, 2020
To all the mothers out there, a very Happy #MothersDay pic.twitter.com/2CyMHZlqUg