దేశంలో కరోనా వైరస్ విలయతాండవం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి తగ్గింది అనుకున్న కరోనా ఎక్కడా కూడా వెనకడుగు వేయడం లేదు. ఈ నేపధ్యంలో కేంద్ర సర్కార్ లాక్ డౌన్ ని పెంచే దిశగా అడుగులు వేస్తుంది. మే 31 వరకు లాక్ డౌన్ ని పెంచాలి అని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. 

 

ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర హోం శాఖ, వైద్య ఆరోగ్య శాఖతో చర్చలు జరిపి దీనిపై నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మరో వారం రోజుల్లో అంటే వచ్చే ఆదివారానికి లాక్ డౌన్ ని మూడో విడత ముగిస్తారు. అక్కడి నుంచి నాలుగో విడత మొదలు కానున్నట్టు తెలుస్తుంది. దీనిపై రెండు రోజుల్లో అధికారిక ప్రకటన రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: