సూపర్ స్టార్ రజనీకాంత్ పళని స్వామి నేతృత్వంలోని అన్నా డీఎంకే సర్కార్ పై విమర్శలు చేశారు. రాష్ట్రంలో భవిష్యత్తులో అన్నా డీఎంకే పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం దేశవ్యాప్తంగా ఆరెంజ్, గ్రీన్ జోన్లలో మద్యం దుకాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మద్యం దుకాణాలు తెరచుకున్న సంగతి తెలిసిందే. 
 
తమిళనాడు సీఎం పళని స్వామి రాష్ట్రంలో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే మద్యం దుకాణాలను మూసివేయాలంటూ తాజాగా చెన్నై హైకోర్టు తీర్పు చెప్పింది. అయితే సీఎం ఈ తీర్పును వ్యతిరేకిస్తూ సుప్రీంను ఆశ్రయించాలని నిర్ణయం తీసుకున్నారు. పళని సర్కార్ తీసుకున్న నిర్ణయంపై సూపర్ స్టార్ స్పందిస్తూ కరోనా విజృంభిస్తున్న తరుణంలో మద్యం దుకాణాలు తెరవాలని ప్రయత్నిస్తే అధికారంలోకి రావడం కలే అవుతుందని విమర్శలు చేశారు. ఆదాయం కోసం పళని సర్కార్ ప్రత్యామ్నాయ మార్గాలను వెతకాలని సూచించారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: