ఐపిఎల్ ద్వారా విదేశీ ఆటగాళ్లను మన దేశంలో ఆడే అవకాశం కల్పిస్తున్నారు. మరి మన దేశ ఆటగాళ్లకు విదేశాల్లో జరిగే లీగ్ లకు అనుమతి..? దీనిపై అనేక సందేహాలు ఉన్నాయి. జాతీయ జట్టు కోసం లేదా ఐపిఎల్ కోసం లేదా ఇంగ్లీష్ కౌంటీ లో మాత్రమే మన వాళ్ళు ఆడాలి అని చెప్తున్న బోర్డ్ మన ఆటగాళ్లను విదేశీ లీగ్ లు బిగ్ బాష్, కరేబియన్ ప్రీమియర్ లీగ్ వంటి వాటికి అనుమతించడం లేదు. 

 

దీనిపై టీం ఇండియా సీనియర్ ఆటగాడు సురేష్ రైనా, మాజీ ఫాస్ట్ బౌలర్ మన ఆటగాళ్లను విదేశీ లీగ్ లకు అనుమతించాలని అలా అయితే మన వారిలో నైపుణ్యం బయటపడుతుందని సూచించారు. వీళ్ళు ఇద్దరూ సోషల్ మీడియా లైవ్ లో మాట్లాడుకుంటూ ఈ వ్యాఖ్యలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: