కరోనా దెబ్బకు విదేశాల్లో చిక్కుకుని ఇబ్బంది పడుతున్న భారతీయులను స్వదేశానికి తీసుకుని రావడానికి గానూ భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు సరికొత్తగా ఆలోచిస్తుంది. ఇప్పటికే వందే భారత్ మిషన్ ద్వారా విదేశాల్లో ఉన్న భారతీయులను వాయు మార్గం ద్వారా కేంద్ర ప్రభుత్వం తరలిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఓడల ద్వారా కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది.

 

ఐఎన్ఎస్ జలాశ్వ ద్వారా సముద్ర సేతు ఆపరేషన్ కి శ్రీకారం చుట్టింది కేంద్ర ప్రభుత్వం. మాల్దీవుల నుంచి మొత్తం 700 మంది భారతీయులను తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇండియన్ నేవీ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టింది. వీళ్ళు అందరూ కూడా జలశ్వ లో కొచ్చీ తీరానికి చేరుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: