దేశంలో కరోనా వైరస్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అందరికి తెలిసిందే. రోజు రోజుకి కరోనా కేసులు పెరగడమే గాని తగ్గిన అవకాశం అనేది ఎక్కడా కనపడటం లేదు అనే చెప్పాలి. ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్యా 63 వేలు దాటింది. మరణాలు కూడా చాలా వేగంగా నమోదు అవుతున్నాయి. 

 

ఇది ఇలా ఉంటే గత 24 గంటల్లో 10 రాష్ట్రాలు గాని కేంద్ర పాలిత ప్రాంతాల్లో గానీ ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వివరించింది. వాటిల్లో ఎవరికి కరోనా లక్షణాలు కూడా కనపడలేదు అని చెప్పింది. ఉన్న వారు పూర్తిగా కోలుకుంటున్నారు అని కేంద్రం తన ప్రకటనలో పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: