దేశ ఆర్ధిక రాజధాని ముంబై లో కరోనా వైరస్ తన ప్రతాపం చూపిస్తుంది. ముంబై లో 12 వేలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇక తాజాగా ముంబైలోని బైకుల్లా మహిళా జైలులో 54 ఏళ్ల మహిళా ఖైదీకి కరోనా పాజిటివ్ అని తేలింది. కరోనా సోకిన తొలి మహిళా ఖైదీ ఆమెనే అని అధికారులు చెప్పారు. 

 

ఆమె శ్వాస పీల్చుకోవడం తో ఇబ్బంది పడటంతో ఆమెకు కరోనా పరిక్షలు చేసారు. మే 8 న ఆమె మొదటి పరీక్ష ప్రతికూలంగా రాగా, మే 9 న నిర్వహించిన రెండవ పరీక్ష చేయగా పాజిటివ్ అని వచ్చింది. ఆమెకు చికిత్స ఇప్పుడు సెయింట్ జార్జ్ ఆసుపత్రిలో జరుగుతోందని అధికారులు పేర్కొన్నారు. ఆర్థర్ రోడ్ జైలులో, 103 మంది ఖైదీలకు కరోనా వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: