ఏపీలో మద్యం ధరలు క్రమంగా పెరుగుతున్న నేపధ్యంలో ఇప్పుడు కొందరు ప్రబుద్దులు తెలంగాణా సరిహద్దుల నుంచి మహారాష్ట్ర సరిహద్దుల నుంచి మద్యం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో అమ్మే కార్యక్రమాలు చేస్తున్నారు. కృష్ణా నదీ పరివాహక ప్రాంతం మొత్తం ఈ కార్యక్రమాలు స్వేచ్చగా జరుగుతున్నాయి ఇప్పుడు.

 

ఇక తాజాగా ఏపీ ప్రభుత్వ వాలంటీర్ ఒకరు పోలీసులకు దొరికిపోయాడు. తెలంగాణా నుంచి మద్యం తీసుకొస్తున్న వాలంటీర్ ని కృష్ణా జిల్లా చిల్లకల్లు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి మద్యం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసారు. అతను ఎవరి కోసం మద్యం తీసుకొచ్చాడు అనే దాని మీద ఇప్పుడు అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: