కరోనా లాక్ డౌన్ ని మూడో విడత కూడా పెంచిన కేంద్రం ఇప్పుడు నాలుగో విడత మీద దృష్టి పెడుతుంది. లాక్ డౌన్ ని మరింత కాలం పెంచే ఆలోచనలో కేంద్ర సర్కార్ ఉంది. కేసులు అదుపులోకి రాకపోవడం రోజు రోజుకి అవి పెరగడంతో ఇప్పుడు నాలుగో సారి కూడా లాక్ డౌన్ పై కేంద్రం నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
ఇక ఇప్పుడు కేంద్ర సర్కార్ లాక్ డౌన్ ని పెంచుతుంది కాబట్టి ప్రజలకు మరో ఉద్దీపన ప్యాకేజ్ ని ప్రకటించాలి అని భావిస్తుంది. దాదాపు ఒక లక్షా 70 వేల కోట్లతో చిన్న మధ్య తరగతి ప్రజల కోసం కేంద్ర సర్కార్ ప్యాకేజి ప్రకటించే అవకాశం ఉంది. ఇక చిన్న మధ్య తరగతి పరిశ్రమలకు కూడా ప్యాకేజి ప్రకటించే సూచనలు ఉన్నాయి.