కరోనా పై పోరాటంలో దేశంలో పోలీసులు అందరిది ఒక ఎత్తు అయితే మహారాష్ట్ర పోలీసులది మరో ఎత్తు. ముంబై పోలీసులు పడుతున్న కష్టం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ముంబై పోలీసులు కరోనా కట్టడిలో చాలా కఠినం గా వ్యవహరిస్తున్నారు. ఇక వారు పడుతున్న బాధలు వారికి మినహా ఎవరికి తెలియదు. 

 

ఈ నేపధ్యంలో టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వారి కృషిని గుర్తించాడు. తన ట్విట్టర్ డీపీ గా వాళ్ళ లోగో పెట్టాడు. “మహారాష్ట్ర పోలీసులు విపత్తులు, దాడులను ఎదుర్కోవడానికి పౌరులకు అండగా నిలిచారు. ఈ రోజు వారు వీధుల్లో కరోనాకు వ్యతిరేకంగా యుద్ధానికి నాయకత్వం వహిస్తున్నారు. కాబట్టి నా ట్విట్టర్ డీపీని మార్చాలి అనుకున్నాను అని పేర్కొన్నాడు. ఈ ప్రయత్నంలో తనతో చేరాలని విజ్ఞప్తి చేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: