తమిళనాడు లో కరోనా వైరస్ తన ప్రతాపం చూపిస్తుంది. ప్రతీ రోజు కూడా అక్కడ 500 పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. తగ్గాయి అనుకున్న కరోనా పాజిటివ్ కేసులు గత వారం రోజులుగా కొన్ని సంఘటనల తో తీవ్రంగా విస్తరిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా తక్కువగా ఉన్నా చెన్నై లో కరోనా తీవ్రత అధికంగా ఉంది. 

 

ఈ రోజు తమిళనాడులో 669 కొత్త కేసులు నమోదయ్యాయి, మొత్తం కేసుల సంఖ్య 7204 కు చేరుకుంది. అయితే అక్కడ మరణాల సంఖ్య మాత్రం చాలా తక్కువగా ఉంది. మరణాల సంఖ్య 47 కి చేరుకుంది. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 5195 గా ఉందని తమిళనాడు ఆరోగ్య శాఖ ఒక ప్రకటన లో తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: