కరోనా తీవ్రత క్రమంగా పెరుగుతున్న నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో 5 వ సారి చర్చలు జరపనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన రాష్ట్రాల సిఎం లతో భేటి అయి పరిస్థితి మీద ఆరా తీయనున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఈ భేటి ఉంటుంది. పరిస్థితి తీవ్రత ఆధారంగా చర్యలు తీసుకునే సూచనలు కనపడుతున్నాయి. లాక్ డౌన్ ని పెంచే ఆలోచనలో ఉన్నారట. 

 

ఈ నెల 31 వరకు ఇప్పటికే తెలంగాణా సర్కార్ లాక్ డౌన్ ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇక మిగిలిన తీవ్రత ఉన్న రాష్ట్రాలు కూడా ఈ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. లాక్ డౌన్ కావాలని ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అందుకే మోడీ నిర్ణయంపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: