దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు అత్యంత వేగంగా నమోదు అవుతున్నాయి. ఒక్క మహారాష్ట్రలోనే నిన్న దాదాపు రెండు వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. ఇక తాజా దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో 4 వేలకు పైగా కరోనా కేసులు నమోదు కావడం కలవార పెడుతుంది. 

 

ఇప్పటి వరకు దేశంలో కరోనా మొదలైన తర్వాత ఈ స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడం అనేది లేదు. ఒక్కసారే 3,900 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పుడు ఒక్క రోజే 4300 కేసులు నమోదు అయ్యాయి. దీనితో 63 వేల నుంచి 67 వేలకు చేరుకున్నాయి కరోనా కేసులు. ప్రస్తుతం 67,186 మంది కరోనా బారిన పడ్డారు. నిన్న ఒక్క రోజే 113 మంది ప్రాణాలు కోల్పోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: