ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఏపీ ప్రభుత్వం కరోనా కట్టడి లో తీసుకుంటున్న చర్యలు క్రమంగా ఫలిస్తున్నాయి. కరోనా కేసులు 80 వరకు నమోదు అయిన రాష్ట్రంలో ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి. దాదాపు పది రోజుల పాటు భారీగా కేసులు నమోదు కాగా గత నాలుగు రోజుల నుంచి కేసులు 50 లోపే నమోదు అవుతున్నాయి. 

 

మొన్న 43 కేసులు, నిన్న 50 కేసులు నేడు 48 కేసులు నమోదు అయ్యాయి. దీనితో ఏపీ సర్కార్ కాస్త ఊపిరి పీల్చుకుంటుంది. ఈ కేసులు ఇంకా తగ్గుతాయని అంటున్నారు. అత్యంత వేగంగా పరిక్షలు నిర్వహించడం అత్యధికంగా  పరిక్షలు నిర్వహించడం ఫలితాన్ని ఇస్తుంది. రాబోయే రెండు మూడు రోజుల్లో కేసులు ఇంకా తగ్గే అవకాశం ఉంది అని వ్యాఖ్యానిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: