మద్యం అమ్మకాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ లో పిటీషన్ దాఖలు అయింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కేసుని విచారించారు. మద్యం అమ్మకాలలో ప్రభుత్వం కనీస భౌతిక దూరం పాటించే విధంగా చర్యలు తీసుకోలేదని పిటీషనర్ ఆరోపించారు. ఇలాంటి సమయంలోనే మద్యం నిషేధించవచ్చు అని న్యాయవాది అభిప్రాయపడ్డారు. 

 

దీనిపై కౌంటర్ వేయడానికి సమయం కావాలి అని ప్రభుత్వ తరుపు న్యాయవాది కోరారు. బుధవారానికి కౌంటర్ వెయ్యాలని ప్రభుత్వ తరుపు న్యాయవాదిని కోర్ట్ ఆదేశించింది. కాగా ఇటీవల ఏపీ సర్కార్ మద్యం అమ్మకాలను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. దీనితో ఇన్నాళ్ళు గా మద్యం కోసం వేచి ఉన్న మందుబాబులు ఒక్కసారిగా క్యూ కట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: