5వ సారి ప్రధాని నరేంద్ర మోడీ కరోనా నేపధ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా లాక్ డౌన్ పొడిగింపు, ఆంక్షలను సడలించడం, కరోనా కేసుల పెరుగుదల సహా పలు విషయాలపై ముఖ్యమంత్రులతో ఆయన చర్చిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆయన సమావేశం అయ్యారు.
లాక్ డౌన్ విషయంలో వారి అభిప్రాయాలను తీసుకుంటారు మోడీ. ఈ కాన్ఫరెన్స్ లో దాదాపు అన్ని రాష్ట్రాల సిఎం లు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్ వైఎస్ జగన్ ఇద్దరూ పాల్గొన్నారు. మే 17న లాక్డౌన్ గడువు ముగుస్తున్న నేపధ్యంలో వారితో తదుపరి చర్యలను మోడీ సిఎం లతో చర్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటారు.