మహానటి సినిమాతో నేటి తరం సావిత్రి గా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కీర్తి సురేష్. నేటి తరంలో ఆ స్థాయిలో ఎవరూ కూడా పాపులర్ అవ్వలేదు నటన పరంగా. అటు తమిళంలో ఇటు తెలుగులో ఆమె ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. ఇక అక్కడి నుంచి మేడం గారికి వరుస ఆఫర్లు వస్తున్నాయి. 

 

అగ్ర దర్శకుల సినిమాల్లో కూడా ఆమెకు మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఇక అగ్ర హీరోలతో సినిమాలతో ఆమె బిజీ గా ఉంటుంది. తాజాగా మరో సినిమాకు కీర్తి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గుడ్ లక్ సఖీ అనే టైటిల్ తో ఆమె సినిమా చేస్తుంది. లాక్ డౌన్ తర్వాత ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: