బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ తెరాస ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఆయన తాజాగా చేసిన విమర్శలు సంచలనంగా మారాయి. రాష్ట్రంలో మిల్లర్లతో కల్వకుంట్ల ఫ్యామిలీ కుమ్మక్కైందని ఆయన ఆరోపించారు. తెలంగాణలో వరి పంట పండటం కొత్త ఏమీ కాదని ఆయన సోమవారం మీడియా తో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఎమ్మెల్యే కాకముందే ఇక్కడ మంచి దిగుబడి ఉందని ఆయన వివరించారు. 

 

గతంలో రైతులు ఇంత ఇబ్బందులు పడలేదన్న ఆయన... కరోనా సమయంలోనూ కరప్షన్ ఆగడం లేదని ఈ సందర్భంగా తీవ్ర విమర్శలు చేసారు.  అవినీతి విషయంలో జగిత్యాల కలెక్టర్ ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా మండిపడ్డారు. టీఆర్ఎస్‌కు లొంగిపోయినా పర్వాలేదు కానీ, రైతుల పొట్ట కొడితే మాత్రం ఊరుకోబోమని ఈ సందర్భంగా హెచ్చరికలు జారీ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: