తెలంగాణా కాంగ్రెస్ లో ముసలం మొదలైందా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. గత కొంత కాలంగా తెలంగాణా కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. పార్టీ బలహీనంగా ఉన్నా సరే వారి విమర్శలు మాత్రం ఆగడం లేదు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి టార్గెట్ గా ఈ విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. 

 

తాజాగా రేవంత్ రెడ్డి పై కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు వెళ్ళింది అనే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వినపడుతున్నాయి. కరోనాపై కేసీఆర్ సర్కార్ విధానాలను తప్పుబట్టే క్రమంలో రేవంత్ రెడ్డి నుంచి సహకారం లేదని ఆయన సొంత గా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఇదే విషయాన్ని అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. ఆయన మీద చర్యలు తీసుకోవాలని కోరినట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: